Aadavallu Meku Joharlu: షూటింగ్ సెట్ లో రష్మిక మందన్న అల్లరి.. వీడియో వైరల్?

Aadavallu Meku Joharlu: టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న, హీరో శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా మార్చి 4న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే. సినిమాకు దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోని విడుదల చేశారు చిత్ర బృందం. ఆ వీడియోలో రష్మిక షూటింగ్ సెట్లో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

YouTube video player

వీడియో స్టార్టింగ్ లోనే క్లాప్ కొట్టినట్టు చూపించారు. ఇక రష్మిక వీడియోలో సెట్ లో ఉన్న అందరినీ నవ్విస్తూ అల్లరి చేస్తోంది. కెమెరా ఆఫ్ లో ఉన్నప్పుడు సీనియర్ నటీమణులు అయినా ఖుష్బూ, రాధిక, ఊర్వశి లు కూడా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. రష్మిక హీరో శర్వానంద్ డైలాగ్ చెబుతున్న సమయంలో పక్కన ఉండి నవ్వించడం, డాన్స్ స్టెప్పులకు నవ్వడం లాంటివి చేస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.