తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల కారణంగా తేదీలను రిషెడ్యూల్ చేశారు. కొత్త తేదీల ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు.. ఏప్రిల్ 23 నుంచి మే 7 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఉంటాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టికల్స్ ఉండగా.. ఏప్రిల్ 11,12 న ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఉండనుందని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
Telangana Inter Exams 2022: ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే!
