మహేష్ కోసం తన స్టైల్ మార్చుకున్న త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలుగు లో ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. రాజమౌళి లాగ భారీ బడ్జెట్ సినిమాలు, గ్రాఫిక్స్ లేకుండా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టే సత్తా ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ అన్ని సినిమాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. త్రివిక్రమ్ ఎలాంటి సినిమాలు తీసినా….అందులో ఫ్యామిలీ టచ్ ఉంటుంది. అలాగే విధంగా యాక్షన్ జోడించినా అది మాస్ జానర్ లోకి వెళ్లదు,

కానీ ఇప్పుడు మొదటిసారి మహేష్ బాబు కోసం తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు మహేష్ బాబు కూడా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసాడు. అందుకే ఈ సారి మాత్రం ఒక పక్క మాస్ కమర్షియల్ సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. అందుకే త్రివిక్రమ్ ని ఆ తరహా స్టోరీ రెడీ చెయ్యమని చెప్పాడని తెలుస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో లవ్, ఫ్యామిలీ జానర్ లు టచ్ చేసి, సెకండాఫ్ మొత్తం మాస్ మీద నడుస్తుందని తెలుస్తొంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.