మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను ఎంతో సందడి చేశాయి.ఈ క్రమంలోనే చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కావటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. ఇకపోతే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతం వహించగా ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇందులో మరొక హీరోయిన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబుతో తలపడటం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ పలువురు సెలబ్రిటీలను పరిగణలోకి తీసుకొని చివరికి కన్నడ క్రేజీ స్టార్ రవిచంద్రన్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇతనితో చర్చలు జరిపారని, ఈ సినిమాలో నటించడానికి కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఒకానొక సమయంలో క్రేజీ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవిచంద్రన్ ఎన్నో సినిమాలలో నటించారు. అయితే గత కొంత కాలం నుంచి రవిచంద్రన్ సినిమాలకు దూరంగా ఉండగా తాజాగా ఈయన మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి.
