ట్రిపుల్ ‘ఏ’: ధియేటర్ బిజినెస్ షురూ చేసిన బన్నీ

సినిమాలతో పాటు, బిజినెస్‌లోనూ చురుకుగా వ్యవహరిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే ఆహా ఓటీటీ ఛానెల్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ‘ఆహా 2.0’ అంటూ దాన్ని ఎక్స్‌టెన్షన్ కూడా జరిగింది. అలాగే, గీతా ఆర్డ్స్, గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థలతో పాటు, అల్లు స్టూడియో నిర్మాణ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ ధియేటర్ బిజినెస్‌ పైనా దృష్టి సారించారు. ప్రముఖ ఏషియన్ సినిమాస్ గ్రూప్‌తో కలిసి అల్లు అర్జున్ ధియేటర్ బిజినెస్‌లో పాట్నర్‌గా అయ్యారు. సరికొత్త టెక్నాలజీతో హైద్రాబాద్‌లో వరల్డ్ క్లాస్ ధియేటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

AAA (ఏషియన్ అల్లు అర్జున్) పేరుతో నిర్మించబడుతున్న ఈ భారీ మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏషియన్ అధినేత సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ నారంగ్, భరత్ నారంగ్ తదితరులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

అన్నట్టు ఇప్పటికే మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలకు ఏషియన్ సినిమాస్ గ్రూప్‌తో భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే.