Shyam Singa Roy: చాణక్యుడి పాత్రలకు ఈ విలన్ చాలా ఫేమస్.. అతనిని తప్ప ఎవరిని ఊహించుకోలేం?

Shyam Singa Roy: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలో కృతి శెట్టి , సాయి పల్లవి , మడోన్న సెబాస్టియన్  కథానాయకులుగా నటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రం క్రిస్మస్ వేడుకల సందర్భంగా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పునర్జన్మ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో మనీష్ వాధ్వా నటించి ఆ క్యారెక్టర్ కు జీవం పోశారు.

శ్యామ్ సింగరాయ్ సినిమాలో విలన్ పాత్రలో మనీష్ వాధ్వా కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.మనీష్ వాధ్వా 1972 లో ముంబై లో జన్మించారు.మనీష్ వాధ్వా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించి.. ఆ తరువాత బుల్లితెర నటుడిగా మారారు .పద్మవాతార్ శ్రీకృష్ణ , చంద్రగుప్తమౌర్య వంటి సీరియల్స్ లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు .మనీష్ వాధ్వా చాణక్యుడు పాత్రలతో బాగా ఫేమస్ అయ్యారు. చాణక్యుడు పాత్రలో వేరే ఎవరిని ఊహించుకో లేనివిధంగా మనీష్ వాధ్వా ఆ పాత్రకు జీవం పోశారు.

మనీష్ వాధ్వా బాలీవుడ్ ఇండస్ట్రీలో పద్మావత్ , మణికర్ణిక వంటి చిత్రాలలో కూడా నటించారు. శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా తెలుగులో తనకి నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో మహంత్ అనే విలన్ పాత్రలో మనీష్ వాద్వా నటించి మెప్పించారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మనీష్ వాద్వా మాట్లాడుతూ టాలీవుడ్ లో పని చేయాలన్నది తన కళ అని చెప్పు కొచ్చారు. శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే తనకు తెలుగులో మరొక సినిమాలో నటించే అవకాశం వచ్చిందని , ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తొందరలోనే వెల్లడిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.