Rana Daggubati: ఇదే నా చివరి సినిమా.. ఇకపై ఇలాంటివి చేయను… దగ్గుబాటి రానా…!

Rana Daggubati : విలక్షణ నటుడు దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే రానా.. ఈసారి కూడా విరాటపర్వం సినిమా ద్వారా ఈనెల 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నక్సలిజం నేపథ్యంలో నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ విరాటపర్వం సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవన్న పాత్రలో రానా నటించగా సాయి పల్లవి ఆయనకు జోడీగా వెన్నెల పాత్రలో నటించింది. ఈ సినిమా ఈ నెల 17వ తేదీ విడుదల కానుండటంతో జూన్ 15వ తేదీ హైదరాబాద్ లో రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

హైదరాబాద్ లో నిన్న సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభమైన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా దగ్గుబాటి రానా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన వెంకటేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసి,తర్వాత ఇక్కడున్న సాయిపల్లవి ఫ్యాన్స్ అందరికి వెల్‌కమ్‌ అని చెప్పగానే గట్టిగా అరుపులు, కేకలు వినిపించాయి. దీంతో సాయిపల్లవి పవర్‌ అంటే ఇది అని రానా చెప్పుకొచ్చాడు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా మరొక ఆసక్తికర విషయం బయటపెట్టాడు. ఎప్పుడు వైవిధ్యమైన కథలు ఎన్నుకునే రానా విరాటపర్వం సినిమాలో నటించటానికి కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్న తర్వాత రానా అభిమానులు ఇలాంటి సినిమాలు చేయకండి అంటూ మెసేజ్ లు చేశారు. దీంతో నాకు కూడా ఇంతమంది అభిమానులు ఉంటారని అనుకోలేదు అంటూ రానా చెప్పుకొచ్చాడు. నా అభిమానులకోసం మరొకసారి ఇలాంటి సినిమాలలో నటించను… ఇదే నా చివరి సినిమా అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా చెప్పుకొచ్చాడు. ఈ సంధర్భంగా ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేశాడు.