APL 2025: ఇండియాలో మొదటి సారి జరుగబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు గ్లోబ్ టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అయిన రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ తాజాగా గురువారం రోజు అధికారికంగా ప్రకటించింది. న్యూఢిల్లీ లోని యుమున స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 12వ తేదీ వరకు అరంగేట్రం ఏపీఎల్ జరుగనుంది.
అయితే ఫ్రాంచైజీ ఆధారిత లీగ్గా జరుగబోతున్న టోర్నీలో ఆతిథ్య భారత్ లోని పురుష, మహిళా కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్ లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లను ఒక చోటుకు చేర్చనుంది. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటుగా భారత ఒలింపిక్ మూమెంట్ ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో లీగ్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. లీగ్లో మొత్తం ఆరు ఫ్రాంచైజీల్లో 36 మంది భారత టాప్ ఆర్చర్లతో సహా 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీపడనున్నారట.
లైట్ల వెలుతురులో గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్ ఫార్మాట్ ద్వారా ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్ విభాగాల్లో పోటీపడనున్నారట. కాగా ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆర్చరీ అనే క్రీడ క్రమశిక్షణ, ఫోకస్, స్థితిస్థాపకతను కల్గి ఉంటుందన్న కారణంతో బంధం ఏర్పరుచుకోవడం జరిగింది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ లో కలిసి కొనసాగడం గర్వంగా ఉంది. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు, గ్లోబల్ స్పాట్లైట్ లో మెరిసే అవకాశం కూడా కల్పిస్తుంది. భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
