Hyderabad: కూతురిపై లైంగిక పాల్పడ్డ తండ్రి.. చివరికి అలా..?

Hyderabad: రోజు రోజుకీ ఈ సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కన్న కూతుర్ల ను కామంతో కళ్లు మూసుకుపోతున్న తండ్రులు వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే కన్న కూతుర్లనే కాటేయడం ఈ నవ సమాజంలో తండ్రులకు అలవాటుగా మారిందా? అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రులు కూతుర్లని టార్గెట్ చేస్తూ వారిపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో ఒక తండాకు చెందిన వ్యక్తి జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. అతనికీ ఐదుగురు సంతానంలో ముగ్గురు 20,13,12 వయస్సు గల ఆడపిల్లలు ఉన్నారు. అతను రోజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నారు. బాగానే ఉన్నప్పటికీ ఈ మధ్య మద్యానికి బానిస అయిన అతను తరచుగా భార్య తో గొడవ పడేవాడు. అంతేకాకుండా కన్నకూతుర్ల ను కూడా లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. కన్నకూతురు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి కొన్ని సందర్భాలలో వారిపై లైంగిక దాడికి కూడా ప్రయత్నం చేశాడు ఆ కామాంధుడు. గమనించిన భార్య ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది. దీనితో ఎలా అయినా తన భార్యను అడ్డు తప్పించుకోవాలని చూసినా అతను మార్చి 17న భార్యను చితకబాదడంతో పాటు ఆమను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.

అదే రోజు రాత్రి సమయంలో మద్యం మత్తులో తన రెండవ కూతురిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఇది గమనించిన మిగతా ఇద్దరు ఆడపిల్లలు గట్టిగా అరవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎవరు లేకుండా బయట గేటుకు తాళం వేసి వెళ్ళిపోయాడు. ఇక ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న అమ్మాయిలు వెంటనే షీ టీమ్ కి ఫోన్ చేయగా, పోలీసులు ఎంతసేపటికీ రాకపోవడంతో వారికి చావే అని భావించిన ఆ ముగ్గురు అక్క చెల్లెలు దగ్గరలోని చెరువుకు చేరుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక మహిళా వారిని చూసి వెంటనే చేరదీసి తనకు తెలిసిన స్వచ్ఛంద సంస్థకు ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయించింది. వెంటనే స్పందించిన వారు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ అమ్మాయిల మేరకు తండ్రిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ ను తరలించినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.