తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే లో స్టార్స్ సందడి.. మెగాస్టార్ తో పాటు దగ్గుబాటి వారసుడు..!

టెలివిజన్ లో ప్రసారమవుతున్న ఎన్నో సింగింగ్ షోస్ ద్వారా చాలా మంది తమలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. అయితే ఇటీవల ఓటిటి వేదికగా తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ఆహా లో ప్రసారమవుతుంది. ఈ షో కి మంచి ప్రేక్షకాదరణ లభించింది. కొంత కాలం క్రితం ప్రారంభమైన ఈ సింగింగ్ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ షో కి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ చంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ షోలో ఇటీవల బాలకృష్ణ సందడి చేసాడు. తానూ సమయం దొరికినప్పుడల్లా ఈ షో చూస్తాను అని. అందరు చాలా బాగా పాటలు పడుతున్నారు అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది. ఈ ఎపిసోడ్ లో ప్రముఖ స్టార్ హీరోలూ గెస్ట్ లుగా పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే లో మెగాస్టార్ చిరంజీవి, దగ్గుబాటి రానా, హీరోయిన్ సాయి పల్లవి పాల్గొన్నట్లు ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో షూటింగ్ జరిగింది. ఈ ఈవెంట్‌కు గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్‌లో కంటెస్టెంట్లతో సందడి చేశారని సమాచారం. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. సూపర్ హిట్ సినిమాలను, వెబ్ సిరీస్ లతో పాటు రియాల్టీ షో లు ప్రసారం చేస్తు తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యింది. ఈ క్రమంలో అన్ స్టాపబుల్ , తెలుగు ఇండియన్ ఐడల్ వంటి రియాలిటీ షో లను కూడా మన ముందుకి తెచ్చింది. ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే జూన్ 17వ తేదీ ప్రసారం కానుంది.