తప్పుడు పోస్టులు పెడుతున్నాడంటూ లోకేష్ కు షాక్ ఇచ్చిన టీడీపీ నేత..

తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ పై తాజాగా కేసు నమోదైంది. మంగళగిరి మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణి నారా లోకేష్ కు పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన తన ట్విట్టర్ లో మార్ఫింగ్ తో తప్పుడు పోస్టులు పెడుతున్నాడని అతడిపై మండిపడింది.

దీంతో ఆమె మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నారా లోకేష్ తో పాటు అతని ఐటి టీం పై కూడా పలు చర్యలు తీసుకోవాలి అని కోరింది. ప్రస్తుతం ఈ విషయం వార్తల్లో బాగా వైరల్ గా మారింది. మరి దీని గురించి నారా లోకేష్ ఏమని స్పందిస్తాడో చూడాలి.