మహేష్ సినిమా కోసం భారీగా పారితోషికం డిమాండ్ చేస్తున్న పూజ హెగ్డే.. ఎన్ని కోట్లో తెలుసా?

పూజా హెగ్డే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే పూజ హెగ్డే నటించిన గత మూడు చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలోనే వరుస ఫ్లాప్ సినిమాలు ఎదుర్కోవడంతో ఈమెకు అవకాశాలు తక్కువగా వస్తాయని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈమె సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం వెల్లువెత్తాయి. ఇకపోతే తాజాగా ఈమె మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా సందడి చేయనుంది.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మహర్షి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా పూజా హెగ్డే తీసుకునే రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పూజా హెగ్డే నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేది లేదంటూ పూజ భారీగా డిమాండ్ చేస్తుంది.ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే పూజా హెగ్డే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకి ఏకంగా నాలుగు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు, తన స్టాప్ కు అయ్యే ఖర్చులను కూడా నిర్మాతలు భరించాల్సిందేనని ఈమె డిమాండ్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే పూజా హెగ్డే స్టాప్ కోసం ఏకంగా మరో కోటి రూపాయలు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే భారీగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.