టీడీపీలో వారసుడు లోకేష్ అలియాస్ చినబాబు పాత్ర పెంచాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పనవ్వడం లేదు. తండ్రిగా చంద్రబాబు చేయాల్సిందంతా తాను చేస్తున్నా తనయుడు మాత్రం దాన్ని నిలబెట్టుకోలే కపోతున్నాడు. పబ్లిక్ మీటింగ్ ల్లో నోరు జారడం…పార్టీకీ..సందర్భానికి పొంతన లేని వ్యాఖ్యానంతో ఎప్పటికప్పుడు అబాసుపాలు అవుతూనే ఉన్నాడు చినబాబు. ఇప్పటికీ అధికార పక్షంపై సరైన విమర్శలు చేయలేక నాలుక కరుచుకున్న సందర్భాలెన్నో. చంద్రబాబు ఎన్ని క్లాస్ లు చెప్పించినా కుక్క తోక వంకర పోతుందా? అన్న చందంగా చినబాబులో ఇసుమొత్తు కూడా మార్పు రాలేదు.
ప్రస్తుతం అధికార పక్షంపై విమర్శలు గుపిస్తోన్న టీడీపీ నేతల్లో లోకేష్ కూడా ఉన్నాడు. రాష్ర్టంలో తాజా పరిస్థితులపై విమర్శలు చేస్తున్నా! చినబాబుకి ఇంకా సరైన రిపిటేషన్ రాలేదు. తాజాగా నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ కిశుభాకాంక్షలు చెప్పి ఎన్టీఆర్ అభిమానులతో సెటైర్లు వేయించుకున్నాడు. అందుకు కారణం గతేడాది స్పందించని లోకేష్ ఈ ఏడాది స్పందించడమే. ఈ సంవత్సరం తారక్ ని లోకేష్ ఎందుకు విష్ చేసినట్లో? అంటూ కామెంట్లు చేసారు అభిమానులు. దీంతో లోకేష్ మాట్లాడినా వివాదమే..మాట్లాడకపోయినా రచ్చే అన్న మాదిరి తయారైంది సన్నివేశం. అప్పుడప్పుడు టెర్రరిస్టులు ఐడెంటిటీ కోసం బాంబులు పెడతారు. ఇప్పుడు లోకేష్ కూడా నేను ఉన్నానని చెప్పడానికే నిన్న తారక్ ని విష్ చేసాడని అభిమానులు జోకులేసుకున్నారు.
అంతేకాదు లోకేష్ కి మంచి సలహా కూడా ఇచ్చారు. బాలీవుడ్ నటుడు సోనుసూద్ వలస కూలీల కోసం సొంత డబ్బు ఖర్చు చేసి బస్సులు వేసి వేలమందిని స్వగ్రామాలకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సమాజంలో రియల్ గా హీరోగా కీర్తింపబడుతున్నాడు. లోకేష్ కూడా అలాంటి ప్రయత్నం చేస్తే పార్టీకి, లోకేష్ వ్యక్తిగతంగాను మంచి మైలేజ్ వచ్చేదని అభిప్రాయపడ్డారు ఫ్యాన్స్. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇంకా చాలా మంది కూలీలు ఇబ్బందలు పడుతున్నారు. బస్సులు వేయాలంటే ఇప్పుడైనా వేయోచ్చు! అందుకు జగన్ అనుమతిస్తారంటూ సెటైర్లు వేసారు ఫ్యాన్స్.