Crime News: తిరుపతిలో విషాదం… తల్లి మరణించిందని తేలిక నాలుగురోజులుగా..!

Crime News: తిరుపతిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.తల్లి మరణించిన సంగతి తెలియక నాలుగు రోజులుగా బాలుడు తల్లి పక్కనే పడుకొని పాఠశాలకు వెళ్లి వస్తున్న ఘటన అక్కడి స్థానికులలో తీవ్ర కలకలం రేపింది. వివరాలలోకి వెళితే…తిరుపతి విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాజ్య లక్ష్మి అనే మహిళ ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. కుటుంబ కలహాల కారణంగా భర్త నుండి విడిపోయి కుమారుడితో కలిసి వేరుగా జీవిస్తోంది.

రాజ్యలక్ష్మి కుమారుడు శ్యామ్ కిషోర్ ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 8 వ తేదీన రాజ్యలక్ష్మి ప్రమాదవశాత్తు ఇంట్లో కింద పడి ఆనారోగ్యంతో మృతి చెందింది. శ్యామ్ కిషోర్ ఈ విషయం తెలియక గత నాలుగు రోజులుగా తన తల్లి బతికే ఉందని భావించి ఇంట్లో ఉన్న ఆహారపదార్థాలను తింటూ ప్రతిరోజు స్కూలుకి వెళ్లి వస్తున్నాడు. ఈ నాలుగు రోజులు తన తల్లి నిద్రపోతుంది అని భావించి ఆమె శవం పక్కనే మంచం మీద నిద్రపోతున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల తన తల్లి వద్ద నుండి దుర్వాసన రావడం గమనించిన శ్యామ్ కిషోర్ ఈ సంగతి ఇ తన మేనమామ అయిన దుర్గా ప్రసాద్ కు తెలియజేశాడు. దుర్గాప్రసాద్ రాజలక్ష్మి ఇంటికి వెళ్లి చూడగా అక్కడ అ తన సోదరి శవమై కనిపించింది. వెంటనే దుర్గాప్రసాద్ ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్యామ్ కిషోర్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని దుర్గాప్రసాద్ వెల్లడించారు.