షాకింగ్ న్యూస్ : ఇండియన్ దిగ్గజ ఫిల్మ్ మేకర్ భార్య మృతి..!

ఇప్పుడు అంటే మన దేశపు సినిమాలు కోసం మాట్లాడితే శంకర్ మన తెలుగు నుంచి రాజమౌళి ల పేర్లు వినిపిస్తాయి కానీ ఎప్పుడో వినూత్న కాన్సెప్ట్ లతో భారత దేశ ప్రేక్షకులకు ఓ రేంజ్ లో సర్ప్రైజ్ చేసిన దర్శకుడు మాత్రం సింగీతం శ్రీనివాసరావు అని చెప్పాలి. తన ఊహా శక్తి గాని సృజనాత్మకత గాని వేరే స్థాయిలో ఉంటాయి. అలా తాను తీసిన “భైరవ ద్వీపం”, “పుష్పక విమానం”, అలాగే “ఆదిత్య 369” లాంటి స్కై ఫై జానర్ సినిమాలతో అబ్బుర పరిచారు.

మరి ఇలాంటి ఈ ఇండియన్ దిగ్గజ దర్శకుని ఇంట తాజాగా తీవ్ర విషాదం నెలకొన్నట్టుగా సినీ వర్గాల్లో షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సింగీతం శ్రీనివాసరావు భార్య లక్ష్మి కళ్యాణి తో 1960 లలో వివాహం వీరికి జరగ్గా గత కొంత కాలం నుంచి ఆమెకు వయస్సు సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడంతో నిన్న రాత్రి 9 గంటల 10 నిమిషాలకు అలా తన తుది శ్వాస విడిచారు. దీనితో సింగీతం ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

అయితే సింగీతం భార్య తన సినిమాలకి కూడా ఎన్నో సార్లు వర్క్ చేసారట. ఇలాంటి భార్యను ఆయన కోల్పోవడం నిజంగా బాధాకరం. దీనితో పలువురు సినీ ప్రముఖులు వారి కుటుంబం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ దిగ్గజ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్న ప్రపంచ స్థాయు సినిమా “ప్రాజెక్ట్ కే” కి గాను రచనా సహకారం తన అనుభవం తో అందిస్తున్నారు.