Jeevita Rajasekhar : షాకింగ్ : జీవిత రాజశేఖర్ ల ఘరానా మోసానికి జైలు తప్పేలా లేదట.!

Jeevita Rajasekhar :  తెలుగు సినిమా దగ్గర కొన్ని కుటుంబాలు ఆ హీరోలు కాస్త సెపరేట్ లోకంలో ఉంటారని చెప్పాలి. ఒకప్పుడు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా పలు రాజకీయాలు కారణాలతో మాత్రం ఇప్పుడు ఇటుఎటూ కానీ పరిస్థితిలో ఉన్నారు.
అలాంటి కుటుంబంలో జీవిత రాజశేఖర్ కుటుంబం కూడా ఒకటి. అయితే వారి పిల్లల సినిమా కెరీర్ ని పక్కన పెడితే రాజశేఖర్ ఇప్పుడు మళ్ళీ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.
మరి ఇపుడు మళ్ళీ తాను సినిమాలు చెయ్యడానికి కారణం ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా “పి ఎస్ వి గరుడ వేగ” సినిమా అని చెప్పాలి. అసలు రాజశేఖర్ కి సినిమాలే లేవు అనే టైం దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ క్రేజీ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ సినిమా తీసి రాజశేఖర్ కెరీర్ కి మంచి హిట్ ఇచ్చి నిలబెట్టాడు.
అయితే ఎంత మంచి సినిమా అయినా దానిని తియ్యడానికి హీరోని నమ్మి డబ్బులు పెట్టే నిర్మాత కూడా ఉండాలి కదా? వచ్చిన ఈ సినిమాకి నిర్మించిన నిర్మాతనే ఇప్పుడు జీవితా రాజశేఖర్ లు ఘరానా మోసం చేశారట. ఈ సినిమాని కొత్త నిర్మాతలు అయినటువంటి జ్యో ఎంటర్ ప్రైజెస్ అధినేత కోటేశ్వర రాజు మరియు హేమ దంపతులు ఈ సినిమా చేసారు.
సరే ఈ సినిమా చేసి హిట్ అయ్యాక అంతా బాగానే ఉంది కానీ వీరి దగ్గర నెగిటివ్ రైట్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా తాలూకా హిందీ హక్కులను రాజశేఖర్ వేరే నిర్మాతకి తమకి తెలియకుండా అమ్మేసాడని మా దగ్గర అన్ని సాక్షాలు ఉన్నాయని వీరు వాపోతున్నారు. మమ్మల్ని వారు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారని డబ్బులు చెల్లించడం లేదని..
వారి కోసం చాలా మంది చెప్పినా ముందు మేము నమ్మలేదని మంచి వారే అని భావించామని కానీ చివరికి మాకు ఇలా చేసారని వారు కోర్టును ఆశ్రయించగా ఇప్పుడు నగరి కోర్ట్ జీవితా రాజశేఖర్ లకి నాన్ బైలబుల్ వారెంట్ ఇచ్చిన ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
దీనితో ఈ ఇద్దరు జైలుకి వెళ్లడం ఖాయం అని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ కేసు ఎక్కడ ఎండ్ అవుతుందో చూడాలి.