నాలో తన కొడుకుని చూసుకొని సందీప్ తల్లి మురిసిపోయింది.. శేష్ షాకింగ్ కామెంట్స్!

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జూన్ 3వ తేదీ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ తన తల్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.అదే విధంగా తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా వివరించారు.

ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ సందీప్ ఉన్నికృష్ణన్ దేశం కోసం ఎలా పోరాడారో అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ఆయన జీవితచరిత్రను సినిమాగా చేయాలని ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ తో పాటు మలయాళ స్టార్స్ కూడా తన తల్లిని సంప్రదించారు. అయితే వీళ్ళతో సందీప్ జీవితకథ చేయటానికి తన తల్లి ఒప్పుకోలేదు. అందుకు కారణం సందీప్ ఉన్నికృష్ణన్ పోలికలు వారిలో లేకపోవడమే.

ఇక ఈ సినిమా కోసం సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిని కలవగా ఆమె ఒక్కసారిగా నన్ను చూసి ఎంతో మురిసిపోయింది. నాలో తన కొడుకుని చూసుకున్నారు. సందీప్, నాకు దగ్గర పోలికలు ఉండడంతో ఈ సినిమా చేయడానికి అవకాశం వచ్చిందని, సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి నాలో తన కొడుకును చూసుకుంటుందని అందుకే తనని అమ్మా అని పిలుస్తానని అడివి శేష్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సినిమా చేసే అవకాశం ఎలా వచ్చింది అనే విషయం గురించి శేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.