Samantha: ఆ సినిమాకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ వ్యాఖ్యలు చేసిన సమంత..?

Samantha: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఏ మాయ చేశావే సినిమాతో సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సమంత నటించిన ఏ మాయ చేసావే సినిమా 2010 ఫిబ్రవరి 26 న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి నేటికి 12 ఏళ్లు గడిచింది.

ఈ సందర్భంగా సమంత తాజాగా భావోద్వేగబరితంగా ఒక పోస్ట్ ను చేసింది.లైట్స్, కెమెరా, యాక్షన్.. అంటూ ఈ పన్నెండేళ్ళ జ్ఞాపకాలు అనుభవాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ గొప్ప సినీ ప్రయాణంలో ఎంతోమంది అభిమానులను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపింది. అవి నేటికీ సరిపోలని క్షణాలు అని పేర్కొంది. సమంత ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.