నాగార్జున స్థానాన్ని ఆక్రమించిన సమంత.. షాక్ లో అక్కినేని ఫ్యాన్స్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ కార్యక్రమం 5 సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ కి సిద్ధమవుతోంది. అదేవిధంగా ఓటీటీలో కూడా ఈ కార్యక్రమం నాన్ స్టాప్ పేరుతో ప్రసారమయింది.ఈ క్రమంలోనే సీజన్ 6 కార్యక్రమానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో కామన్ మాన్ ఎంట్రీ ఉంటుందని నాగార్జున ఒక వీడియో ద్వారా తెలిపారు.ఇక ఈ కార్యక్రమానికి నాగార్జున యాంకర్ గా ఉండలేనని తనకు కాస్త విరామం కావాలంటూ అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే బుల్లితెరపై ఈ కార్యక్రమం ప్రసారం అయినప్పటి నుంచి మొదటి సీజన్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు, రెండవ సీజన్ నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అప్పటినుంచి మిగతా సీజన్లకు అలాగే నాన్ స్టాప్ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈయన యాంకర్ గా తాను ఉండలేనని చెప్పడంతో బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జున మాజీ కోడలు సమంతను సంప్రదించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించడం కోసం సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కమింగ్ సూన్ అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారని పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇలా నాగ్ మాజీ కోడలిగా ఉన్నటువంటి సమంత ఏకంగా నాగార్జున యాంకర్ స్థానాన్ని ఆక్రమించి అక్కినేని అభిమానులకు షాక్ ఇచ్చారు.అయితే సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా బిజీగా ఉన్న నేపథ్యంలో కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా అంటూ పలు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.మరి ఈ విధంగా వీరి గురించి వస్తున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఈ విషయం అక్కినేని అభిమానులకు షాకింగ్ న్యూస్ అయినప్పటికీ సమంత అభిమానులు మాత్రం ఎంతో ఖుషి అవుతున్నారు.