నిన్ను తలచుకుంటే పెదాలపై చిరునవ్వు వస్తుంది.. షాకింగ్ పోస్ట్ చేసిన సమంత..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పూర్తిగా కెరిర్ పైనే దృష్టి పెట్టింది. అంతేకాకుండా అప్పుడప్పుడు వెకేషన్ లు తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ తన ప్రతి ఒక కదలిక గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రకృతి అందాలను అభిమానించే పంచుకుంటోంది.

అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మరింత రెచ్చిపోయి ఈ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు కూడా చేస్తోంది. ఇకపోతే దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది సమంత. ఇకపోతే విజయ్ దేవరకొండ సమంత ఇద్దరూ మహానటి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మరొకసారి వీరిద్దరు జంటగా కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్ర బృందం కాశ్మీర్ లో ఉన్నారు. కాశ్మీర్ లో సమంత, విజయ్ దేవరకొండ మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత కాశ్మీర్ లోని ప్రకృతి అందాలను షూటింగ్ కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాశ్మీర్ అందాల గురించి పోస్ట్ పెట్టింది. అక్కడ ప్రకృతి అందాలను చూసి తనమనసు పారేసుకున్న సమంత.. కాశ్మీర్‌ను ఎప్పుడు తలచుకున్న కూడా తన పెదవులపై చిరునవ్వు విరబూస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కాశ్మీర్ లోని అక్కడి ప్రజల జీవనశైలి తెలిసేవిధంగా అక్కడి ఫొటోలను ఆమె పంచుకుంది. కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో సమంత సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా, విజయ్‌ దేవరకొండ స్టైలిష్‌ అబ్బాయిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.