Sai Pallavi: బురఖా ధరించి సినిమా చూడటానికి వెళ్లిన సాయి పల్లవి.. చివరికి ఏమైందంటే?

Sai Pallavi: సాయి పల్లవి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సాయి పల్లవి చదువు పూర్తయిన వెంటనే మలయాళంలో ‘ ప్రేమమ్ ‘ అనే సినిమాల్లో నటించి భారీ స్థాయిలో పాపులారిటీ పొందింది. ఈ సినిమా వల్ల సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ద్వారా తెలుగులో ‘ ఫిదా ‘ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా , సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఫిదా సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచింది.

ప్రస్తుతం సాయి పల్లవి నటించిన ” శ్యామ్ సింగరాయ్ ” లో రోజీ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది.
సాధారణంగా తాము నటించిన సినిమా ఎలా ఉందో.. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని తెలుసు కోవాలని హీరో , హీరోయిన్లకు చాలా ఉత్సాహంగా ఉంటుంది.. ఈ విధంగానే సాయి పల్లవి కూడా తాను నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారు.. అని తెలుసుకోవడానికి తను కూడా ప్రేక్షకులతోపాటు సినిమా థియేటర్ కు వెళ్లి శసినిమా చూసింది.

సాయి పల్లవి తను నటించిన సినిమా చూడటానికి ఎలా వెళ్ళిందో తెలుసా..? ప్రేక్షకులు ఎవరు తనని గుర్తు పట్టకుండా బురఖా ధరించి సినిమా చూడటానికి హైదరాబాదులోని మూసాపేటలో శ్రీ రాములు థియేటర్ కి ఒక వ్యక్తి తో కలిసి వెళ్ళింది. ప్రస్తుత ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది అయితే థియేటర్లో ఆమెను ఎవరు గుర్తుపట్టక పోవటం గమనార్హం. తిరిగి ఆమె వెళుతున్న సమయంలో తన ఐడెంటిటీని బయట పెట్టారు.