అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీశాంత్‌ గుడ్‌బై

sreesanth to play in president cup T20 after 7 years of ban

శ్రీశాంత్ కెరీర్‌ను అనేక వివాదాలు చూట్టూ ముట్టాయి. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన కేసులో దోషిగా తేలాడు. దీంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్లు నిషేధం విధించింది. 2020 సెప్టెంబర్‌తో నిషేదం పూరైనా.. అతడికి భారత జట్టు తరఫున ఆడే అవకాశాలు రాలేదు. తాజా ఐపీఎల్ వేలంలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ఇప్పటివరకు 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్ 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు తీశాడు. 10 టీ20 మ్యాచుల్లో 7 వికెట్లు, ఐపీఎల్‌లో 40 మ్యాచుల్లో 44 వికెట్లను సాధించాడు