కథే నా ప్రాణం అంటోన్నరౌడీ బ్రదర్

సినిమాలపై ఉన్న ఇష్టంతో లక్షల జీతం వచ్చే అమెరికా ఉద్యోగాన్ని వదిలేసి, సినిమా రంగంలో అడుగుపెట్టాడు రౌడీ బ్రదర్ ఆనంద్ దేవరకొండ. తొలి సినిమా ‘దొరసాని’ నిరాశపరిచినప్పటికీ, సెకండ్ ఛాన్స్ తొందరగానే దక్కించుకున్నాడు. అదే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’. కరోనా కారణంగా ఓటీటీలో రిలీజైన ఈ మూవీతో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

ఇప్పుడు ‘పుష్పక విమానం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పలు ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంటున్నాడు. అందులో భాగంగా విభిన్నమైన కథలకే తాను ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు. నటుడిగా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటానంటున్నాడు. కథ నచ్చితే ప్రాణం పెడతానంటున్నాడు.

ఆనంద్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికొస్తే, రెండు సినిమాలు రెడీగా ఉన్నాయట. సాయి రాజేష్‌తో ఓ సినిమా, కేవీ గుహన్ దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ వేటికవే డిఫరెంట్‌గా ఉండబోతున్నాయట. ప్రేక్షకుల నుంచి ఖచ్చితంగా ప్రశంసలు దక్కుతాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ.