ఇటు టీవీ షోలు, అటు రాజకీయాలలో రాణిస్తున్న రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన రోజా ప్రస్తుతం మంత్రి పదవి దక్కించుకుంది. ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రోజా జబర్థస్త్ షో కి అధికారికంగా స్వస్తి చెప్పింది. అప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసమే తన మొత్తం సమయాన్ని కేటాయిస్తుంది. ప్రతి విషయంలోనూ విపక్షాల మీద విరుచుకుపడే రోజా ఈ సారి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది.
ఈరోజు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా బాలకృష్ణ నిమ్మకూరులో సందడి చేశారు. ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరు వెళ్ళిన బాలకృష్ణ అక్కడ తన తండ్రికి నివాళులు అర్పించారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ … ఇన్ని రోజులుగా గుర్తు రాని నిమ్మాకురు ఇప్పుడూ గుర్తొచ్చిందా అంటూ బాలకృష్ణ మీద విరుచుకుపడ్డారు. బాలకృష్ణ చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదవటం మానేసి ఎన్టీఆర్ తనయుడు బయటికి వస్తే చాలా బాగుంటుంది అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా బాలకృష్ణ అని చూస్తే చాలా జాలి వేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.
ఇక మహానాడు విషయానికి వస్తేఅందులో తిట్ల పురాణం తప్ప మరింకేమి ఉండదు అంటూ చెప్పుకొచ్చింది. చంద్రబాబు జీవితమంతా 420 పనులు చేయటమే సరిపోతుంది. జగన్ ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడితే కనీసం కృతజ్ఞత భావం కూడా చూపించలేదని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. తాము చేసిన తప్పులను సరిదిద్దు కోకుండా మహానాడు ద్వారా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు అంటూ రోజా మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడులు గురించి కూడ రాజా ప్రస్తావించారు.
