Acharya Movie: వివాదంలో ఆచార్య సినిమా.. చిత్ర బృందం పై పోలీస్ కేస్..!

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆచార్య సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే ఆచార్య సినిమా తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 4 వ తేదీ విడుదల చేయాలని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఒక వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో హీరోయిన్ రెజీనా చిందులు వేశారు. ఈ ఐటమ్ పాటలో ఒక లిరిక్ ఆర్ఎంపీ డాక్టర్ ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆర్ఎంపీ డాక్టర్ ల సంఘం ఈ సినిమా పై పోలీస్ కేసు నమోదు చేశారు.

ఈ ఐటం సాంగులో ఓ చోట ‘ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు’ అని ఉంది. ఇప్పుడు ఇదే లైన్‌ వివాదానికి దారితీసింది.లిరిక్ ఆర్.ఎం.పి డాక్టర్ల వృత్తిని మనోభావాలను కించపరిచేలా ఉందని వెంటనే ఈ సినిమాలో ఈ పాటను తొలగించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఈ పాటను రాసిన రచయిత డైరెక్టర్ పై కూడా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్‌ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.