మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ సైన్యం ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

ప్రతి స్టార్ హీరో సినీ కెరీర్ లో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఆగిపోయిన సినిమాలు ఉంటాయి. అలా మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో చాలా సంవత్సరాల క్రితం సైన్యం అనే సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రకటన వెలువడి ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోవడంతో ఆ సమయంలో అటు మహేష్ అభిమానులు ఇటు త్రివిక్రమ్ అభిమానులు ఎంతగానో ఫీలయ్యారు.

అతడు, ఖలేజా సినిమాల తర్వాత హ్యాట్రిక్ సినిమాగా మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సైన్యం సినిమా ఎం.ఎస్.రాజు నిర్మాతగా తెరకెక్కాల్సి ఉంది. సైన్యం సినిమాకు సంబంధించి కొంతకాలం పాటు స్క్రిప్ట్ పనులు, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. అయితే తర్వాత రోజుల్లో ఈ సినిమా ఆగిపోవడంతో పాటు ఎం.ఎస్.రాజు సైతం పెద్ద సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చారు.

7 డేస్ 6 నైట్స్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ కు సైన్యం సినిమాకు సంబంధించి ప్రశ్న ఎదురు కాగా అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అయితే సైన్యం కోసం తయారు చేసిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి త్రివిక్రమ్ మహేష్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మహేష్ బాబు లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.