బాలకృష్ణ, విజయశాంతి మధ్య గొడవలకు కారణమైన సినిమా ఏదో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ అందరితో స్నేహపూర్వకంగా ఉంటారనే సంగతి తెలిసిందే. బాలయ్య విజయశాంతి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. బాలయ్య ప్రస్తుతం వరుసగా ఊరమాస్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమా టైటిల్ ను ప్రకటించడానికి సమయం ఉందని దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. బాలయ్య శృతి హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం కావడం గమనార్హం. నిర్మాతలు హీరో హీరోయిన్ దర్శకుడి రెమ్యునరేషన్ కోసమే 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

బాలయ్య విజయశాంతి కాంబినేషన్ లో ఏకంగా 17 సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఒక సినిమా వల్ల వీళ్లిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని సమాచారం అందుతోంది. బాలయ్య హీరోగా ఒక సినిమాను నిర్మించాలని విజయశాంతి భావించారు. అలా విజయశాంతి భర్త నిర్మాతగా బాలయ్య హీరోగా తెరకెక్కిన మూవీ నిప్పురవ్వ కావడం గమనార్హం.

ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా బాలయ్య హీరోగా నటించిన బంగారు బుల్లోడు సినిమా కూడా నిప్పురవ్వ విడుదలైన రోజునే రిలీజైంది. బంగారు బుల్లోడు హిట్ కాగా నిప్పురవ్వ ఫ్లాప్ అయింది. ఈ సినిమా వల్ల విజయశాంతికి భారీగా నష్టాలు వచ్చాయి. ఈ సినిమా వల్ల బాలయ్య విజయశాంతి మధ్య దూరం పెరిగిందని సమచారం అందుతోంది.