“ఆ రోజు” జరిగిన సంఘటనల వల్లే మోహన్ బాబు చంద్రబాబును ‘మోసగాడు’ అన్నారా ? 

Reason behind Mohan Babu's angry on Chandrababu Naidu

2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పరాజయాన్ని మనసారా కోరుకున్న వ్యక్తుల్లో మంచు మోహన్ బాబు కూడ ఒకరు.  టీడీపీ చిత్తుగా ఓడిపోయినందుకు ఆయన చాలా సంతోషించారు.  మోహన్ బాబుకు ఎన్టీఆర్ అంటే దైవంతో సమానం.  అన్నగారు.. అన్నగారు అంటూ ఆయన గురించి చాలా గొప్పగా చెబుతుంటారు.  టీడీపీతో కూడా మోహన్ బాబుది గట్టి బంధమే.  ఆయన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీతోనే.గతంలో బాబుగారితో మోహన్ బాబుకి హెల్తీ రిలేషన్ నడిచింది.  అలాంటి ఆయన ఈరోజు చంద్రబాబును మోసగాడని అనడం, విపరీతమైన కోపం పెంచుకోవడం చాలా ఆశ్చర్యం.  కానీ ఆ కోపం వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయి. 

Reason behind Mohan Babu's angry on Chandrababu Naidu
Reason behind Mohan Babu’s angry on Chandrababu Naidu
 
తాజాగా ఒక మీడియా ఛానెల్లో మాట్లాడిన కలెక్షన్ కింగ్ చంద్రబాబును ఎన్నో రకాలుగా విమర్శించారు.  తనను మోసం చేసే ఒకడు ఎదిగాడని అంటూ పేరు చెప్పకుండానే బాబు మీద విపరీత స్థాయిలో విమర్శలు చేశారు.  ఇన్నాళ్లు మోహన్ బాబుకు తన విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రీఎంబర్సిమెంట్ బకాయిల్ని బాబు ప్రభుత్వం చెల్లించలేదనే కోపం ఉండేదని అంతా అనుకున్నారు.  కానీ గతంలో జరిగిన చంద్రబాబు కు ఆయనకు మధ్య పెద్ద సమస్యలే ఉన్నాయని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టారు మోహన్ బాబు.  ఆ కారణాలు వింటే ఇద్దరి మధ్యా ఇంత జరిగిందా అనుకుంటారు ఎవరైనా. 
 
“అసలు నా రాజకీయ జీవితం ఒకడు దెబ్బ కొట్టడం వలనే నా రాజకీయ జీవితం నాశనమైంది.  అతన్ని నమ్మి రాజకీయాల్లోకి దిగి మోసపోయాను.  నన్ను మోసం చేసి అతను ముఖ్యమంత్రి అయ్యాడు.  కలిసి వ్యాపారం మొదలుపెడితే అందులోనూ మోసం చేశాడు.  అతడేమో వేల కోట్లకు పడగలెత్తాడు.  ఆ వ్యక్తి చేసిన మోసాలన్నింటినీ మర్చిపోయి రాజీకి వెళ్లాలని కొందరు అంటారు.  కానీ నొప్పి నాకు తెలుసు” అంటూ చాలా వేదనతో మాట్లాడారు.  ఆ మాటలు విన్న తర్వాత  ఎన్నికలప్పుడు మోహన్ బాబు చంద్రబాబు కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి, టీడీపీ ఓటమిని అంత బలంగా కాంక్షించడానికి ఆరోజు మోహన్ బాబుకు చంద్రబాబు చేసిన మోసమే కారణమని స్పష్టమవుతోంది.