Ravi Teja- Balakrishana:అప్పుడే గొడవలు మర్చిపోయారా.. ఆహా టాక్ షోలో బాలయ్య, రవితేజ?

Ravi Teja- Balakrishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వెండి తెరపై తనదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వెండితెరపై మాత్రమే కాకుండా ఆహా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ మాట తీరుతో ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అఖండ చిత్రబృందం, రాజమౌళి వంటి ఎంతో మంది హాజరై ఎన్నో విశేషాలను పంచుకున్నారు.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజరయ్యారు త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి మాస్ మహారాజ రవితేజ రానున్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. ఈ ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకున్న రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రవితేజ బాలకృష్ణ టాక్ షోలో పాల్గొన్న పోతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణకు రవితేజకు మద్య గొడవలు ఉన్నాయని అందుకోసమే వీరిద్దరూ బయట ఎక్కడ కలిసి కనిపించరనే వార్తలు వీరి గురించి పెద్ద ఎత్తున వినిపిస్తున్నప్పటికీ ఇలా ఒకే కార్యక్రమంలో వీరిద్దరు కనిపించబోతున్నారు అంటే వీరి మధ్య ఉన్న గొడవలు మరిచిపోయారా.. అందుకే ఇలా ఇద్దరు కలిసి ప్రేక్షకులను సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా అని పలువురు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు ఈ కార్యక్రమానికి రవితేజతోపాటు డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా హాజరవుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.