మరోసారి రెమ్యూనరేషన్ పెంచిన రవితేజ… ఎంత పెంచారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ గురించి మనకు తెలిసిందే. ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయిన నేపథ్యంలో గత ఏడాది గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా ద్వారా బాక్సాఫీస్ హిట్ కొట్టారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో రవితేజకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ విధంగా వరుస సినిమాలను లైన్ లో పెట్టిన రవితేజ ఈ ఏడాది మొదట్లో ఖిలాడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచిందని చెప్పాలి.

ఈ విధంగా తన తదుపరి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ విషయంలో రవితేజ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఈ విధంగా రవితేజ సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచుతూ వచ్చారు.అయితే తాజాగా ఈయన నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా వచ్చేనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే కాకుండా ధమాకా, రావణాసుర షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఇకపోతే వచ్చేనెల 17వ తేదీ విడుదల కానున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

ఈ విధంగా వరుస సినిమా షూటింగ్లతో ఎంతో బిజీగా ఉన్న రవితేజ టైగర్ నాగేశ్వర రావు అనే సినిమా కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం ఈయన మరోసారి తన రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రవితేజ ఏకంగా 20 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రవితేజ కూడా తన సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుతూ ప్రొడ్యూసర్లకు షాక్ ఇస్తున్నారు.