రష్మికకు ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్!?

టాలీవుడ్ లోకి ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కుర్రది రష్మిక మందన్న తన అందచందాలతో, నటనతో యువతరం గుండెల్నిపిండేసింది. కూర్గ్ కు చెందిన ఈ  కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటుతోంది.

ఈ బ్యూటీ 2020లో ‘నేషనల్ క్రష్‌’గా ఎంపికైన విషయం తెలిసిందే. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన  ‘పుష్ప’ లో శ్రీవల్లిగా అదరగొట్టింది. అందరి హృదయాలను కొల్లగొట్టింది.  తాాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రంలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటిస్తోంది.

ఇటు తెలుగు.. అటు  తమిళ చిత్రాల్లో  దుమ్మురేపుతోన్న రష్మిక బాలీవుడ్ లోనూ బిజీ అవుతోంది. తాజాగా  ఆమెకు హిందీలో మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం.   వివరాల్లోకి వెళితే.. హిందీ యువ హీరో టైగర్ ష్రాఫ్‌ తదుపరి సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించే ఛాన్స్ దక్కించుకుందని తెలిసింది.  ఇక ఇప్పటికే ప్రస్తుతం రష్మిక చేతిలో  మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ సినిమాలు ఉండగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఇక రష్మిక తెలుగులో ‘పుష్ప 2’లో నటిస్తుంది.

ఈ సినిమాతో పాటు ఆమె సీతరామం, వారసుడులో కూడా  నటిస్తుంది.  రష్మిక మందన్న..’గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి ‘డియర్ కామ్రెడ్’ సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

ఇటు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే 2021 లో విడుదలైన సుల్తాన్ అనే సినిమాతో తమిళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అంతేకాదు మిషన్ మజ్ను సినిమా ద్వారా రష్మిక హిందీ చిత్రాల్లో కూడా అడుగుపెట్టింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా చేస్తున్నారు. దాంతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ‘గుడ్ బై’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు.

టాప్ టక్కర్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌తో బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు రష్మిక మందన్న.  ప్రస్తుతం రష్మిక చేతిలో బోలెడన్ని ఆఫర్స్ అవి కూడా ప్యాన్ ఇండియా లెవల్లో వివిధ భాషల నుంచి ఈ అమ్మడికి వస్తున్నాయి.  వచ్చిన వాటిలో ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది.  ‘పుష్ప’ సినిమా హిందీలో ఈ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ అందుకుని సంచలనం సృష్టించింది.  పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు.

‘పుష్ప’తో అల్లు అర్జున్‌తో పాటు రష్మికకు ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ పెరిగింది.  అందుకే ఇపుడు చేయబోతున్న సినిమాలకు ఏకంగా తన రెమ్యునరేషన్‌ను డబుల్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఈ భామ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నట్టు సమాచారం.    అటు రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌లో కూడా రష్మిక మందన్న పేరునే ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది!!