అప్పులతో ‘కూలి’ సినిమా షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కి సీరియస్ ఇంజురీ అయ్యి దాదాపు ప్రాణాల మీదకు వచ్చిందని చాలా వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక మందన్న కూడా ఒక ప్రాబ్లెమ్ తో హైదరాబాద్ కి చెందిన ప్రముఖ డాక్టర్ ఏ వి గురువారెడ్డి కలిసిందని తెలిసింది.
‘పుష్ప’ సినిమాలో శరీర బరువు మొత్తం మోకాళ్లపై ఉంచి సామీ సామీ పాటకు రష్మిక వేసిన స్టెప్ కారణంగా ఆమెకు మోకాళ్ళ నొప్పలు వచ్చాయని, ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చానని డాక్టర్ చెప్పారు. అలాగే త్వరలో అల్లు అర్జున్ కూడా భుజం నొప్పితో నా వద్దకు రావొచ్చని, అభిప్రాయ పడ్డారు.
‘పుష్ప’ సినిమాలో మేనరిజం కోసం అల్లు అర్జున్ లేని గూని నటించాడు. ఒక భుజాన్ని పైకి ఎత్తుకొని సినిమా మొత్తం కనిపించారు. ఈ కారణంగా అల్లు అర్జున్ కి భుజం నొప్పి రావచ్చని ఆయన అంచనా వేశారు డాక్టర్ ఏ వి గురువారెడ్డి.