Bunny Vas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ. పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అయితే రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అప్పటినుంచి అల్లు అర్జున్ తరువాతి సినిమా గురించి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
వారి ఎదురు చూపులకు ఎండ్ కార్డు వేస్తూ తమిళ దర్శకుడు అట్లీతో ఒక భారీ సినిమాను ఒకే చేశారు హీరో అల్లు అర్జున్. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలయ్యింది. ఈ ప్రాజెక్టుకి సంబందించిన అనౌన్స్ మెంట్ వీడియోకి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుంది అని జస్ట్ హింట్ ఇచ్చారు మేకర్స్.
అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఆడియన్స్ మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా అల్లు అర్జున్, అట్లీ సినిమా విడుదల గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు నిర్మాత బన్నీ వాస్. ఆయన నిర్మాతగా వస్తున్న లేటెస్ట్ మూవీ మిత్ర మండలి. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న బిన్నీ వాస్ అల్లు అర్జున్ సినిమా విడుదల గురించి చెబుతూ.. అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని సంక్రాంతికి అధికారికంగా ప్రకటిస్తారు అని చెప్పుకొచ్చాడు. దాంతో ఆ కామెంట్ కాస్తా వైరల్ గా మారింది. ఈ న్యూస్ తెలియడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Bunny Vas: అల్లు ఫ్యాన్స్ కీ గుడ్ న్యూస్.. AA22 మూవీ రిలీజ్ డేట్ చెప్పిన బన్నీ వాస్!
