Rashmika Mandanna: అరగంట కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిన రష్మిక మందన్న..?

Rashmika Mandanna: టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. వరుసగా హిట్ సినిమా టాక్ లను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ తో దూసుకుపోతోంది. ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో రష్మిక మందన రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఆమె నటించిన సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

పుష్ప సినిమాతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరుచుకుంది ఈ బ్యూటీ. ఇది ఇలా ఉంటే హీరో రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం లో నటిస్తున్న సినిమాలో రష్మిక మందన కూడా నటిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ సినిమాలో ఒక అరగంట అటూ ఇటుగా ఉన్న ఒక పాత్ర కోసం రష్మిక ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కేవలం 20 నుంచి 30 నిమిషాల వరకు ఉండే పాత్ర కోసం రష్మిక మందన దాదాపుగా కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కేవలం అరగంట కు కోటి రూపాయల రెమ్యూనరేషన్ అడిగింది అంతే రష్మిక మందన రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె నటించిన సినిమాలు వరుసగా సూపర్ హిట్ అవడంతో ఆమె ఫుల్ ఫామ్ లో ఉండటమే కాకుండా, రష్మిక మందన అడిగినంత డబ్బు ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు కూడా సిద్ధమయ్యారట. మొత్తానికి రష్మిక చరణ్, కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది.