కార్తికేయ 2  కెజిఫ్, RRR  కంటే గొప్ప చిత్రం అంటున్న రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఎదోకరకంగా వార్తల్లో నిలవాలని చూస్తుంటాడు. తన సినిమాలు ఆడకపోయినా…వేరే సినిమాల్ని పొగుడుతూనో….విమర్శహిస్తూనో ఉంటాడు. కొన్నాళ్ల క్రితం ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను తెగ పొగిడిన వర్మ ఇప్పుడు ‘కార్తికేయ 2 ‘ సినిమాను మెచ్చుకున్నాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు తో బాటు హిందిలో కూడా బారి కలెక్షన్స్ రాబట్టుతుంది.

నిఖిల్ కి తెలుగు లో కూడా ఏ మాత్రం పెద్ద మార్కెట్ లేదు. అలాంటిది ఈ సినిమా  తెలుగు మార్కెట్ ని మించి హిందీ మార్కెట్ ని పరుగులు పెట్టిస్తుంది. బాలీవుడ్ చిత్రాలు `లాల్ సింగ్ చడ్డా`..`రక్షాబంధన్` లాంటి సినిమాల్ని సైతం వెనక్కి నేటి బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ని ఉదహరించి రాంగోపాల్ వర్మ `కార్తికేయ-2` పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసారు. “నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించగా అభిషేక్ నిర్మించిన చిత్రం కార్తికేయ 2. ఈ మూవీ  సినిమా విడుదలై  రెండో వారంలో కూడా మంచి కలెక్షన్లని సాధిస్తోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్లో ఆమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చడ్డా`..` అక్షయ్ కుమార్` నటించిన రక్షాబంధన్ సినిమాలకంటే రెండు రెట్లు ఎక్కువగా వసూళ్లు సాధిస్తోంది. పెట్టుబడి మీద వచ్చిన ఆదాయ పరంగా పోల్చితే ఎస్ఎస్ రాజమౌళి సినిమా `ఆర్ఆర్ఆర్`.. ప్రశాంత్ నీల్ సినిమా `కేజీయఫ్ 2` కంటే `కార్తీకేయ 2`నే గొప్ప చిత్రం. చందు మొండేటికి కంగ్రాట్స్’ అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్ గా మారింది.  15 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే  వరల్డ్ వైడ్ 60 కోట్లకు పైగా వసూళ్లని  సాధించింది. మరో 40 కోట్లు సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఒక వేళా అదే జరిగితే  టాలీవుడ్ చరిత్రలో `కార్తికేయ-2`ని ఓ సంచలనంగా చెప్పొచ్చు.