Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ ఈయన తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇలా చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే త్వరలోనే రామ్ చరణ్ ఒక అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలో మైనపు విగ్రహాలను మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అలాగే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల మైనపు విగ్రహాలతో పాటు స్పోర్ట్స్ రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలను కూడా మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
త్వరలోనే రామ్ చరణ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్ తో పాటు తన పెట్ రైమ్ కొలతలను కూడా మేడం టుస్సాడ్స్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విగ్రహం తయారీ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది.
ఇక త్వరలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని మేడం టుస్సాడ్స్ అధికారకంగా ప్రకటించారు. మే 9వ తేదీ లండన్ లోని మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఈ విగ్రహాన్ని తిరిగి సింగపూర్ మ్యూజియంకి తరలించబోతున్నారని తెలియజేశారు. రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరించబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.