Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. ఈ క్రమంలోనే ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పయనం అయ్యారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది స్టార్ హీరోల మైనపు విగ్రహాలను మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అల్లు అర్జున్ మహేష్ బాబు ప్రభాస్ వంటి హీరోల విగ్రహాలను ఇప్పటికే మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
ఇక త్వరలోనే రామ్ చరణ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం కూడా ఖరారు చేసిన నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా లండన్ వెళ్లినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ తో పాటు తన పెట్ రైమ్ విగ్రహాన్ని కూడా మేడం టుస్సాడ్స్ ఏర్పాటు చేయబోతున్నారు మే 9వ తేదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మొత్తం లండన్ వెళ్లారు.
మే తొమ్మిదవ తేదీన సాయంత్రం లండన్ కాలమానం ప్రకారం 6:15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా లండన్ చేరుకున్నారు. అయితే ఈ విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో ఆవిష్కరించి అనంతరం సింగపూర్లో ఉన్నటువంటి మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అయిన వారందరి విగ్రహాలను ఏర్పాటు చేశారు అయితే రామ్ చరణ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో చరణ్ కూడా ఈ గౌరవాన్ని అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.