మధ్యలో నీ గోల ఏంటీ అంటూ.. యాంకర్ పై ఫైర్ అయిన రాజేంద్రప్రసాద్!

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F3 ఈ సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ నటించాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదిలా ఉండగా ఇటీవల F3 మూవీ విడుదలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఈ సినీమా చుసిన ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా థియేటర్లలో మాత్రం జనాలు కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. ఎఫ్3 సినిమా సక్సెస్ అవడంతో తాజాగా ఫన్ రైడ్ సెలెబ్రేషన్స్ అంటూ సినిమా యూనిట్ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. సుమ వెకేషన్ కి వెళ్ళటంతో ఈ ఈవెంట్ ని మంజుష యాంకర్ గా వ్యవహరించింది. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటల వినిపిస్తూ ఆయనని స్టేజి మీదకు ఆహ్వానించారు. దీంతో ఆయన మొహానికి మాస్క్ వేసుకొని స్టేజి మీదకి వచ్చారు. ఆ సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా హిట్టు అవ్వకపోతేనా మొహం చూపించనుని ఆయన అన్న మాటలు వీడియో వేసి చూపించారు.

రాజేంద్రప్రసాద్ మొహం కనిపించకుండా మాస్క్ అడ్డు పెట్టుకోవటంతో.. సర్ మాస్క్ తీసేయండి ఎందుకు దాన్ని మొహానికి అడ్డుగా పెట్టుకున్నారు అని మంజూష అంటుంది. దీంతో రాజేంద్ర ప్రసాద్ కొంత అసహనానికి గురై ఉండవమ్మా.. ఏంటి నీ గోల.. ఇక్కడ మా గోలే ఎక్కువైందని రాజేంద్ర ప్రసాద్ అనడంతో మంజూష పక్కకు వెళ్లిపోయింది.తర్వాత ఆయన మాస్క్ వేసుకోవడానికి గల కారణం చెప్పాడు. సినిమా హిట్ అవ్వకపోతే తన మొహాన్ని ఎవ్వరికీ చూపించనని అన్నాను.. కానీ సినిమా సూపర్ హిట్. సోమవారం కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయంటే సినిమా హిట్ కాక ఇంకేం అవుతుందని రాజేంద్ర ప్రసాద్ అన్నాడు.