కోటి ఖర్చైనా పర్వాలేదు.. ‘పుష్ప’లో ఆమె ఉండాల్సిందే

Pushpa makers ready to spent one crore on item song
Pushpa makers ready to spent one crore on item song
సుకుమార్ ‘పుష్ప’ చిత్రాన్ని అన్ని హంగులతో అలంకరిస్తున్నారు. మొదట ఒక భాగమే అని ఇప్పుడు రెండు భాగాలుగా చేసి సినిమాను రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగం షూటింగ్ కొద్దిగా మాత్రమే మిగిలుంది. పూర్తిస్థాయి మాస్ మసాలా సినిమా కావడంతో మాస్ ప్రేక్షకులకు ఎలాంటి ఆశాభంగం కలగకుండా చూసుకుంటున్నారు సుకుమార్.  అందుకే మొదటి భాగంలో ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట.  ఆ ట్రీట్లో భాగంగానే మంచి ఐటమ్ సాంగ్ ఒకటి ప్లాన్ చేశారట.  పాట అంటే సాదా సీదా పాట కాదు.. థియేటర్ దద్దరిల్లిపోయేలా ఉండే పాట. 
 
ఈ పాట కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడ కేటాయించారట.  ముఖ్యంగా ఈ పాట కోసం ఒక స్టార్ నటిని తీసుకోవాలని అనుకుంటున్నారు. స్టార్ అంటి అంటే ఫుల్ గ్లామర్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్ అన్నమాట.  సుకుమాట దృష్టిలో పూజా హెగ్డే, దిశా పఠానీ ఉన్నారట.  పాటకు గ్లామర్ అప్పీల్ రావాలి అంటే వీరిద్దరిలో ఒకర్ని తీసుకోవాల్సిందేనని సుకుమార్ గట్టిగా అనుకుంటున్నారట.  అయితే వీరిద్దరూ ఫామ్లో ఉన్న కథానాయికలే కాబట్టి ఐటమ్ సాంగ్ కోసం భారీ పారితోషకం డిమాండ్ చేసే అవకాశం ఉంది.  అయినా వెనక్కు తగ్గేది లేదని కోటి రూపాయలు ఇచ్చి అయినా సరే వారిని తీసుకురావాలని ‘పుష్ప’ దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారని టాక్.