Aakash Poori: పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ ఒక్క రూపాయి తీసుకోకుండా సినిమా చేశారు.. పీ.జీ విందా!

Aakash Poori: డైరెక్షన్ చేయాలనుకున్న సినిమా, తాను రాసుకున్న ఒక కథని, ఒక ఫైనాన్షియర్‌కి సంబంధించి, చిన్న ప్రొడ్యూసర్‌ను సంప్రదించకుండా, ఒక పెద్ద ప్రొడ్యూసర్‌ను అప్రోచ్ అయినట్టయితే ఆ విధానం వేరే ఉండేదిగా అన్న విషయంపై ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. విందా ఇలా స్పందించారు. దానికి ప్రొడ్యూసర్ పరంగా కొన్ని కారణాలుంటాయని, డైరెక్టర్ పరంగా డైరెక్షన్‌కు సంబంధించి రకరకాల కారణాలుంటాయని ఆయన తెలిపారు. తక్కువ ఖర్చుతోనే సినిమా చేద్దామనుకున్నామన్న ఆయన అన్నారు. ఆ మూవీలో హీరోగా పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్‌ పూరీ నటించారని విందా చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో నటించినందుకు గాను ఆకాశ్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే పూరీ గారు కూడా ఆకాశ్‌తో మంచి సినిమా చేయించు, మంచిగా యాక్టింగ్‌ చేయించు అని మాటల సందర్భంలో చెప్పినట్టు ఆయన వివరించారు. ఆయన డబ్బుల గురించి కూడా ఏం అనలేదని చెప్పారు. తాము చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ కాబట్టి, చాలా రోజుల నుంచి వాళ్లతో చేస్తున్నాం కాబట్టి ఆ లిబర్టీ ఉంటుందని ఆయన అన్నారు.

అదే పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళితే ఇలాంటి సినిమాను వాళ్లు ప్రొడ్యూస్ చేసి ఉండకపోవచ్చు అని ఆయన తెలిపారు. ఇతను ఉండడం వల్లనే చిన్న సినిమా అయినా కలిసి చేద్దామనే ఉద్దేశంతోనే చేయడం జరిగిందని ఆయన వివరించారు. కానీ పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా కొందరు తనను ఈ విషయంలో ప్రశ్నించారని విందా చెప్పారు. దానికి తోడు ఇలాంటి సినిమాను ఎందుకు తీశావు అని కూడా అన్నారని, కానీ అప్పటికే ఖర్చు పెట్టింది 50లక్షలు కానీ కొందరు ప్రొడ్యూసర్ తక్కువ ఖర్చు పెట్టినా ఎక్కువ చెప్పుకుంటారు. దాంతో అది మిస్ లీడ్ కావడం, ఆయన కూడా ఆర్థికపరంగా పెట్టిన డబ్బులకు, వాటికి వడ్డీలు ఆగిపోవడమూ జరిగిందని ఆయన అన్నారు. కాబట్టి సరైన పర్సన్స్, సరైన అసోసియేషన్స్ చాలా ముఖ్యం అని ఆయన వివరించారు. దాంతో కొన్ని మిస్ అండర్‌స్టాండింగ్స్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చిందని ఆయన చెప్పారు. దాంతో తాను కూడా ఆ ఏడాది ఖాళీగా ఉండాల్సి వచ్చిందని విందా చెప్పుకొచ్చారు.