ఛార్మి ని వదిలి ఉండలేనంటున్న పూరి జగన్నాధ్

సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్, అఫైర్స్ అనేవి సర్వ సాధారణం. కొందరు హీరో హీరోయిన్ల భార్యలు భర్తలు.. స్టార్ డైరెక్టర్ల భార్యలు..ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం విడాకులవరకు వెళ్తారు. టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్ ఎఫైర్ గురించి ఒక పెద్ద రూమర్ ఉంది. వాళ్ళే పూరి జగన్నాధ్, ఛార్మి.

మొదట్లో ఛార్మి, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో పీకల్లోతు ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది అనుకున్నారు కూడా. కానీ, ఏమైందో…ఇద్దరు విడిపోయారు. దేవి పర్సనల్ లైఫ్ గురించి అంతగా ఎవరికీ తెలియదు, కానీ ఛార్మి మాత్రం పూరి జగన్నాధ్ తో బిజినెస్ పార్టనర్ గా ఉంది.

ఛార్మి వల్ల పూరి జగన్నాధ్ కి తన భార్య కి పెద్ద గొడవలు జరిగాయని కొన్ని వార్తలు వచ్చాయి. వీళ్ళ మధ్య ఎఫైర్ ఉందో లేదో వాళ్లకు మాత్రమే తెలుసు కానీ జనాలు మాత్రం వీళ్ళ మధ్య ఏదో ఉందని గట్టిగా నమ్ముతున్నారు. దానికి వాళ్ళ బిహేవియర్ కూడా ఆజ్యం పోసినట్లు అవుతుంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లడం ..చేతిలో చేతులు పట్టుకొని తిరగడం జనాల అనుమానాలకు కొత్త అనుమానాలు రేకెత్తించాయి.

ఈ మధ్య ఇద్దరు…తమ సినిమా ‘లైగర్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ తన వ్యక్తిగత జీవితాల గురించి ఓపెన్ అప్ అయ్యారు. సాధారణంగా పూరి జగన్నాథ్ తన ఫ్యామిలీ గురించిన విషయాలు బయటపెట్టడు. కానీ మొదటి సారి తన పర్సనల్ విషయాలను బయటపెట్టాడు. ఈ క్రమంలోనే తనకు హీరోయిన్ ఛార్మీకు మధ్య ఏదో సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు.

పూరి మాట్లాడుతూ..” హీరోయిన్ ఛార్మికు నాకు ఏదో సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి ఆ వార్తలు నేను చూసిన చూడనట్టే వెళ్లిపోతాను ఎందుకంటే మా మధ్య ఏ సంబంధం లేదు. ఉన్నదల్లా ఫ్రెండ్ షిప్. ఛార్మి నాకు 13 ఏళ్ల వయసు నుంచే తెలుసు. చాలా మంచి అమ్మాయి. గొప్ప నటి ఆమెతో సినిమాలు కూడా చేశాను. మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాము. ఈ విషయం మా ఇళ్లల్లో ని వారికి తెలుసు. మా పిల్లలకి తెలుసు.. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ..మీడియాలో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చిన ప్రతిసారి నవ్వుకుంటాం..ఆ తర్వాత లైట్ తీసుకుంటాం.

సరే మీరు అనుకున్నట్టే మా మధ్యే ఎఫైర్ ఉందని అనుకుందాం. మరి ఎఫైర్ అయితే ఇన్ని సంవత్సరాలు ఉంటదా. మా పని అయిపోగానే తీరిపోయేదిగా. ఆకర్షణ తీరిపోతుందిగా. మాది అది కాదు అంటే ఫ్రెండ్ షిప్ అనేగా అర్థం. ఇప్పటివరకు మేము కలిసి ఉన్నాం అంటే మా మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్ షిప్ ఉంది. ఎందుకంటే ఆకర్షణ అనేది చాలా తక్కువ రోజులు ఉంటుంది. స్నేహం ఒక్కటే లైఫ్ లాంగ్ ఉంటుంది. మేము ఎప్పటికీ స్నేహితులుగా శాశ్వతంగా కలిసి ఉంటాం అది ఎప్పటికైనా సరే ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఎప్పటికీ ..మేము స్నేహితులం..” అంటూ గట్టిగా చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్ .