Prabhas: ప్రభాస్ చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రతి చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఉండేలా రూపొందిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ మొదలుకుని ‘సలార్, ఆదిపురుష్’ లాంటి ప్రతి చిత్రమూ పాన్ ఇండియా చిత్రమే, అయితే ఒక సినిమా మాత్రం పాన్ వరల్డ్ సినిమా. అదే నాగ్ అశ్విన్ చిత్రం. ఈ సినిమాను ఇండియా లెవల్లో కాదు ఏకంగా ప్రపంచ స్థాయిలో ఉండేలా తెరకెక్కించాలని ఆలోచనట.

ఇదొక భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం. దీపికా పదుకొనే కథానాయికగా నటించనుంది. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యవయంతో ఈ సినిమా ఉండబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ ఈ చిత్రాన్నినిర్మించనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం జూన్ లేదా జూలై నాటికి ఈ సినిమా సెట్స్ మీద ఉండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి.
ప్రభాస్ చేస్తున్న ‘ఆదిపురుష్, సలార్’ రెండూ కూడ వెనకబడ్డాయి. అవి పూర్తవడానికి షెడ్యూల్ కంటే ఎక్కువ సమయం పట్టేలా ఉంది. దీంతో నాగ్ అశ్విన్ సినిమాను అక్టోబర్ నెలకు పోస్ట్ ఫోన్ చేశారట. అప్పటికి ప్రభాస్ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయితే ఆ సినిమా మొదలవుతుంది. లేకుంటే మరోసారి వాయిదాపడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
