Prabhas: రాధేశ్యామ్.. ప్రభాస్‌కు ఏమీ మిగిలేలా లేదట

Prabhas not taking any profits in Radhe Shyam

Prabhas: ప్రభాస్ చేస్తున్న బిగ్ బడ్జెట్ సినిమాల్లో ‘రాధేశ్యామ్’ కూడ ఒకటి. ఇది కంప్లీట్ లవ్ స్టోరీ. ఎక్కడా యాక్షన్ కంటెంట్ పెద్దగా ఉండదు. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాక ప్రభాస్ ఇలాంటి సినిమా చేయడం ఏమిటని అభిమానులే షాకయ్యారు. లవ్ స్టోరీ చేయడం మంచిదే కానీ ఇలా కమర్షియల్ అంశాలను పక్కనపెట్టి చేయడం ఏమిటని అంతా అనుకున్నారు.

Prabhas not taking any profits in Radhe Shyam
Prabhas not taking any profits in Radhe Shyam

నిజానికి ఈ సినిమా వెనుక ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రధాన పాత్రధారి. ఆయనే సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్ అయితే అచ్చంగా పెదనాన్న కోసమే ఈ సినిమా చేస్తున్నారు. ఇంతటి స్టార్ డమ్ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకు ఉపయోగపడకపోతే ఎలా అనే ఉద్దేశ్యంలో చేస్తున్నారు. సినిమాను మొదట్లో లిమిటెడ్ బడ్జెట్లోనే చేయాలని అనుకున్నారు.

కానీ లాక్ డౌన్ మూలంగా, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడంతో బడ్జెట్ డబుల్ అయింది. దాంతో ప్రభాస్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ను రంగంలోకి దింపారు. దాంతో సినిమా ముందుకెళ్లింది. అయితే మిగతా సినిమాల్లో మిగిలినంత డబ్బు ఈ సినిమాలో ప్రభాస్ కు మిగిలేలా కనిపించట్లేదట. పెట్టిన బడ్జెట్, జరిగిన బిజినెస్ దాదాపు ఒకేలా ఉన్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ తన వాటా కింద 50 కోట్లు లేదా 60 కోట్లు పుచ్చుకుంటే పెదనాన్నకు ఏమీ మిగలదు. అందుకే ఆయన తన ఆదాయాన్ని మర్చిపోయారని తెలుస్తోంది.