Pooja Hegde: కరోనా సెకండ్ వేవ్ దేశం మొత్తం విజృంభిస్తోంది. రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. సినీ తారలు సైతం కరోనా బారినపడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ తాకిడి మరీ ఎక్కువగా ఉంది. లాక్ డౌన్ అనంతరం దాదాపు షూటింగ్స్ అన్నీ మొదలయ్యాయి. దీంతో వైరస్ వేగంగా విస్తరించింది.

ప్రజెంట్ మన స్టార్ హీరోలు పవన్, మహేష్, రవితేజ, ప్రభాస్, రామ్ చరణ్ ఐసోలేషన్లో ఉన్నారు. చాలామంది నటీనటులు, దర్శకులు కూడ కరోనా బారినపడ్డారు. ఇప్పుడు వారి జాబితాలోకి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడ చేరింది. ఆమెకు కూడ కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రజెంట్ ఆమె ఐసొలేషన్లో ఉంటోంది.
తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని పూజా హెగ్డే చెబుతోంది. తెలుగు, తమిళం, హిందీ ఇలా మూడు భాషల్లోనూ పూజాకు పెద్ద సినిమాలున్నాయి. ఇటీవల మొత్తం ఆమె రాధేశ్యామ్ చిత్రీకరణలోనే పాల్గొంది. బహుశా అక్కడే ఆమెకు వైరస్ సోకి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
