వైరల్ : ఫస్ట్ టైం హీరోయిన్ పూజా హెగ్డేకి ఒక అరుదైన గౌరవం.!

pooja hegde : ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మంచి హ్యాపెనింగ్ హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే వారిలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒకామె. అయితే పలు నెగిటివిటీలతో ఆమె ఆ మధ్య మంచి ట్రెండ్ అయినా టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనే మార్క్ తో బాగానే భారీ ఆఫర్స్ తన సొంతం చేసుకుంది.

అలా రీసెంట్ గా “బీస్ట్”, “ఆచార్య”, అలాగే భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” తో అలరించింది. అయితే వీటిలో కొన్ని ఘోరమైన ప్లాప్స్ గా కూడా నిలిచాయి. అయినా ఇప్పుడు అయితే ఈమెకి పాన్ ఇండియా అపీల్ ఉంది. మరి దీనితో ఇప్పుడు మొదటిసారి ఒక అరుదైన గౌరవం దక్కినట్టుగా టాక్ సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

గ్లోబల్ గా నిర్వహించేటటువంటి కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ లో కానెస్ ఫిలిం ఫెస్టివల్ కూడా ఒకటి. అయితే ఈ ఏడాది నిర్వహించే ఈ ఫెస్టివల్ కి గాను ఇండియన్ సినిమా నుంచి పూజా హెగ్డే కి ఫస్ట్ టైం ఆహ్వానం వచ్చిందట. దీనితో ఈ గ్లోబల్ ఈవెంట్ లో పాల్గొనే ఫస్ట్ ఇండియన్ నటిగా పూజా హెగ్డే ఇప్పుడు ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

దీనితో ఈ టాక్ ఇండియన్ సినిమా దగ్గర మంచి హాట్ టాపిక్ గా మారగా ఈ ఈవెంట్ ఈ మే 16న ఫ్రాన్స్ దేశంలో జరగనుందట అలాగే ఆల్రెడీ పూజా కూడా అక్కడ ల్యాండ్ అయ్యినట్టు తెలుస్తుంది.