మహేష్ బాబు సినిమా నుంచి పక్కకు తప్పుకున్న పూజా హెగ్డే… కారణం అదేనా?

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కీర్తి సురేష్ నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా హిట్ అవ్వటానికి తమన్ అందించిన సంగీతం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు నటించబోయే తర్వాత సినిమా గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నాడు. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ సినిమా ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాలు విడుదల అయ్యాయి. 11 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కి సంబందించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. జూలై నెలలో ఈ సినిమా షూటింగ్ పట్టలేక్కనున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న 28 వ సినిమాలో మహేశ్ బాబుకి జోడీగా అందాల భామ పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ అమ్మడు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో పూజా హెగ్డే ఈ సినిమాలో నటించే అవకాశం చేజార్చుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను కొట్టిపడేస్తూ.. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా పూజా హెగ్డే నటిస్తుందని సినిమా యూనిట్ అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలా నటిస్తున్నట్టు సమాచారం.