Pooja Hegde: నేను ఈ స్థాయిలో ఉన్న సాధించాల్సింది చాలా ఉంది.. పూజా హెగ్డే కామెంట్స్ వైరల్!

Pooja Hegde: టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బుట్ట బొమ్మ ప్రస్తుతం ప్రస్తుతం సరైన సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఇకపోతే తెలుగులో పూజా అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాతో ఇండస్ట్రీలో కొంతకాలం పాటు ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ దాదాపు మూడు సంవత్సరాలుగా తెలుగులో ఒక సినిమాలో కూడా నటించలేదు.

అందుకు గల కారణం ఆమె నటించిన సినిమాలు ప్లాప్ అవ్వడమే. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన పూజా ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఇటీవలే సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమాలో హీరోయిన్ గా చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన రాధేశ్యామ్‌, బీస్ట్, ఆచార్య, సిర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా రీసెంట్ గా వచ్చిన రెట్రో ఇలా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడికి వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. కొన్నాళ్లుగా నా లైఫ్ లో విజయం అనే పదానికి అర్ధం మారిపోయింది. కానీ నాకు ఈ సమయం చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చుపిస్తాయని అనుకుంటున్నాను. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను సాధించాల్సింది చాలా ఉంది. అందరి జీవితంలో హెచ్చుతగ్గులు కచ్చితంగా ఉంటాయి. మేము నటులం ఫ్లాప్ లను కూడా స్వీకరించాలి. బీస్ట్‌ సినిమా తర్వాత ఇప్పుడు జన నాయగన్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. కానీ ఇది విజయ్ చివరిచిత్రం అవ్వడం ఒకింత బాధగా అనిపిస్తుంది. నా దృష్టిలో ఇదొక చేదు వార్త. ఎందుకంటే నాతో పాటు చాలా మంది అభిమానులు విజయ్‌ సినిమాల్ని ఇష్టపడతారు. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం ఎదురుచూసేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ సందర్భంగా పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.