ఫ్యాన్స్ లేకుండా పవన్ వేడుకా.. నో వే !

Pawan Kalyan fans

Pawan Kalyan fans

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ అన్ని పనులు పూర్తిచేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 9న రిలీజ్ ముహూర్తం. ఈలోపు భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ చేయాలని నిర్ణయించారు నిర్మాత దిల్ రాజు. ఈ ఈవెంట్ కోసం సుమారు కోటి రూపాయల్ని ఖర్చు చేయనున్నారట. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇలా ముగ్గుర్నీ ఒకే వేదికపై చూడటమంటే మెగా అభిమానులకు పండగే. మామూలుగానే మెగా హీరోల వేడుకలు అంటే భారీ ఎత్తున జనం వస్తారు. అందునా పవన్ సినిమా ఈవెంట్ చెప్పనక్కర్లేదు. ఇక ముగ్గురు స్టార్లు ఒకే వేదిక మీద అంటే ఆ థ్రిల్ మామూలుగా ఉండదు.

మామూలుగా వచ్చే జనానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువగానే వస్తారు. అదే ఇప్పుడు సమస్యగా మారిందట. అసలే కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇంత భారీ మొత్తంలో జనం గుమిగూడటం అంటే రిస్కీ విషయమే. అదే నిర్మాతను టెంక్షన్ పెడుతోంది. అంతమందిని పిలిచి వేడుక చేస్తే ఏవైనా సమస్యలు తలెత్తుతాయా అని ఆలోచిస్తున్నారు. అలాగని పరిమిత సంఖ్యలో మాత్రమే అభిమానుల్ని అనుమతిస్తామంటే అస్సలు కుదరదు. గొడవ గొడవ అయిపోతుంది. వీటన్నింటినీ కాదని ఏదైనా స్టార్ హోటల్లో ఈవెంట్ పెట్టి లైవ్ ఇస్తే.. అసలు కిక్కే ఉండదు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం ఈవెంట్ పెద్ద లెవల్లో జరపాల్సిందేనని, అన్ని పొలిటికల్ మీటింగ్లు, ఇతర సినిమా ఫంక్షన్లు జరుగుతూనే ఉన్నాయి కదా అంటున్నారు.