క్రేజీ ఆఫర్ కొట‌్టేసిన ఇస్మార్ట్ హీరోయిన్… పవన్ తో రచ్చ మామూలుగా ఉండదంటున్న నిధి

పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమా కోసం పలువురు భామల పేర్లు స్క్రీన్ పైకి వచ్చాయి. లేటెస్ట్ గా ఈ సినిమా సమాచారం మేరకు ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ని నిర్ణయించారు. అలాగే మరో పాత్ర కోసం ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రాజెక్ట్ లో నిధి సైన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ సినిమాలో నిధి అగర్వాల్ ఛాన్స్ కొట్టేసిందంటూ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు పవన్ అభిమానులు కూడా సంబరపడుతున్నారు.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసుకున్నారు. దీంతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ లో అతి త్వరలోనే హీరోయిన్స్ జాక్వెలిన్, నిధి అగర్వాల్ సెట్స్ కి వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని భారీ అంచనాలతో.. బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కోహినూర్ వజ్రం కథ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని.. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బంధిపోటుగా కనిపిస్తారని ఫిల్మ్ టీమ్ తెలిపింది.

ఇక నిధి అగర్వాల్ కూడా పలు బిజీ షెడ్యూల్ తో ఉంది. మజ్ను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన ఈ బ్యూటీ ఇప్పటికే పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా సరైన సినిమా అవకాశాలు రాకపోయినప్పటికీ కోలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాపైనే ఆమె ఆశలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది.