విజ‌య‌నిర్మల మ‌న‌వ‌డు శరణ్ హీరోగా న‌టిస్తున్న `మిస్టర్ కింగ్` నుండి మెలోడి బ్రహ్మ మణిశర్మ కంపోజింగ్ లో ‘నేనెరగని దారెదో’ పాట విడుదల

విజ‌య నిర్మల గారి మ‌న‌వుడు శరణ్ కుమార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సీనియ‌ర్ న‌రేశ్ అల్లుడు (న‌రేశ్ క‌జిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ ప‌తాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుండి ‘నేనెరగని దారెదో’ పాటని చిత్ర యూనిట్ విడుదల చేసింది. యూత్ ఫుల్ మెలోడీ నెంబర్ గా ఈ పాటని అద్భతంగా  స్వరపరిచారు మణిశర్మ. హారిక నారాయణ్ పాటని పాడిన విధానం లవ్లీగా వుంది.

♫ నేనెరగని దారెదో నన్నే చేరి
నా నడకని మార్చేసిందా ?
నేతలవని మాయేదో నీలా సోకి
నా బ్రతుకును అల్లేసిందా..?
నువ్వు పిలిచినా.. పేరు నాదని అననా..
నువ్వు నడిచినా దారే.. నడకవానా..♫

ఈ పాటకు కడలి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. లవ్లీ మెలోడీగా ఆకట్టుకున్న ఈ పాట ఇన్స్ టెంట్ హిట్ గా నిలిచింది.

యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ద‌శ‌లో వుంది.

న‌టీన‌టులు:

శరణ్ కుమార్, నిష్కల, ఊర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్,ఎఎస్ కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు